తిరుపతి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ ఖరారైనట్టు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభ.. కర్ణాటక చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. రెండేళ్ల క్రితమే రిటైర్ అయిన రత్నప్రభ... ఆ తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం కర్ణాటక స్కిల్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తున్నాయి. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేయనున్నారు. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.