నేను ఒక్క డైలాగ్ చెబితే ప్రపంచమే నివ్వెరపోయింది: మల్లారెడ్డి

నేను ఒక్క డైలాగ్ చెబితే  ప్రపంచమే నివ్వెరపోయింది: మల్లారెడ్డి

తెలంగాణలో ఎవరూ చేయలేని అభివృద్ధిని కేసీఆర్ చేశారని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి.   పాలమ్మిన, పూలమ్మిన అనే ఒక్క డైలాగ్ చెబితే ప్రపంచమే నివ్వెర పోయింది.. సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిందన్నారు. మల్లన్న తుమ్మితే తుపాన్ వస్తుంది. పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం నాది. ఫంక్షన్లో మాటవరుసకి ఏదో మాట్లాడితే దానిని వైరల్ చేస్తున్నారు. మల్కాజ్ గిరిలో గెలిచేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు మల్లారెడ్డి.  

బీజేపీ నేతలు రాముడు అక్షింతలంటూ  ప్రజలను మభ్యపెడుతున్నారన్నాని విమర్శించారు. మల్కాజిగిరి  బీఆర్ఎస్  అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన  మల్లారెడ్డి .. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో పసలేదు బుసలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అన్నారు.కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకోవటానికి సరిపోతుందన్నారు..ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసన్నారు.మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పారు.  రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.