ప్రజా పాలన కాదు.. పడకేసిన పాలన : మంత్రి నిరంజన్​ రెడ్డి

ప్రజా పాలన కాదు.. పడకేసిన పాలన : మంత్రి నిరంజన్​ రెడ్డి
  • మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలన పడకేసిందని, రైతుకు భరోసా లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ ఒక మాయ అని, రైతు భరోసా ఒక భ్రమ అని ఆరోపించారు. రాష్ట్రంలో రూ.2 లక్షల రుణం మాఫీ అయిన ఒక్క  రైతును చూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం10 నెలల్లో రూ.80 వేల కోట్లు అప్పుచేసినా ఏ రంగంలోనూ గణనీయమైన మార్పు రాలేదని ఆరోపించారు.

శనివారం మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలంగాణ భవన్​లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో అప్పులు చేసి అనేక రంగాల్లో సమూల మార్పులకు బాటలు వేశామని, ప్రస్తుత ప్రభుత్వం అప్పులు చేసి రుణమాఫీ మాత్రం చేయలేదని విమర్శించారు.