మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ కలకలం

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ కలకలం

మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. న్యూఢిల్లీ వీఐపీ ఏరియాలోని సౌత్ ఎవెన్యూ ప్లాట్ నెంబర్ 105లోని జితేందర్ రెడ్డి నివాసం వద్ద  కారు డ్రైవర్‎తోపాటు ముగ్గురు అతిథులను దుండగులు  అపహరించారు. మహబూబ్ నగర్ కు చెందిన ఉద్యమకారుడు మున్నూరు రవి, తన ఇద్దరు స్నేహితులతో కలిసి వ్యక్తిగత పనుల మీద కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వచ్చాడు. వీరంతా.. జితేందర్ రెడ్డి ఇంట్లో ఉంటున్నారు. కాగా.. నిన్న సాయంత్రం రవితో పాటు అతని స్నేహితులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వీరందరినీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ పుటేజీలో నమోదయ్యాయి. వీరిని దుండగులు ఎందుకు అపహరించారనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పటివరకు కిడ్నాప్ అయిన వారి ఆచూకీ కూడా ఇంకా తెలియలేదు. ఈ మేరకు ఢిల్లీ సౌత్ ఎవెన్యూ పీఎస్‎లో జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‎కు సంబంధించిన విషయాన్ని జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

మరిన్ని వార్తల కోసం

జోరుగా గోద్రెజ్​ జెర్సీ పాల అమ్మకాలు

నాటి కమెడియన్... నేటి ఉక్రెయిన్ అధ్యక్షుడు