జోరుగా గోద్రెజ్​ జెర్సీ పాల అమ్మకాలు

జోరుగా గోద్రెజ్​ జెర్సీ పాల అమ్మకాలు

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణతోపాటు, ఇతర ప్రాంతాలలోనూ పాల అమ్మకాలు ప్రీ కోవిడ్​ లెవెల్​కు చేరుతున్నట్లు క్రీమ్​లైన్​డెయిర్​ ప్రొడక్ట్స్​ లిమిటెడ్ సీఈఓ భూపేంద్ర సూరి చెప్పారు. విద్యాసంస్థల మూసివేతతో కోవిడ్​ టైములో పాలు, ఇతర డెయిరీ ప్రొడక్టుల అమ్మకాలు బాగా తగ్గాయని, ఇప్పుడు ప్రీ కోవిడ్​లెవెల్​లో 95 శాతానికి చేరువయ్యాయని పేర్కొన్నారు.  త్వరలో  బిజినెస్​లో మూడు నుంచి నాలుగు శాతం గ్రోత్​ సాధించగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. గోద్రెజ్​ జెర్సీ బ్రాండ్​ పెరుగుకు హైదరాబాద్​, తెలంగాణ మార్కెట్లలో మంచి ఆదరణ దొరుకుతోందని , ఈ సెగ్మెంట్లో తాము రెండంకెల గ్రోత్​ సాధిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో టెట్రా ప్యాక్​కెపాసిటీని మూడు రెట్లు పెంచుతున్నామని, ఇందుకోసం ఈ ఏడాది రూ. 20 కోట్లు ఖర్చు పెడుతున్నామని సూరి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిపి డెయిరీ ప్రొడక్టుల మార్కెట్​ విలువ రూ. 56 వేల కోట్ల దాకా ఉంటుందని వివరించారు.