హైదరాబాద్, వెలుగు : దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్అన్నారు. రేవంత్ కామెంట్లను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. మంత్రులంతా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్..విద్యుత్కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై మాట్లాడారని క్లారిటీ ఇచ్చారు. విద్యుత్అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా అని నిలదీశారు.