విద్యుత్ అక్రమాలపైనే రేవంత్ మాట్లాడిండు : పొన్నం ప్రభాకర్​

విద్యుత్ అక్రమాలపైనే రేవంత్ మాట్లాడిండు :  పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్​, వెలుగు : దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్​ ఒక్కటేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​అన్నారు. రేవంత్ ​కామెంట్లను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. మంత్రులంతా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్..విద్యుత్​కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై మాట్లాడారని క్లారిటీ ఇచ్చారు. విద్యుత్​అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్​ సిద్ధమా అని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపిస్తారా అని నిలదీశారు.