రైతు అనుమానాస్పద మృతి: అల్లుడే చంపాడంటూ…

రైతు అనుమానాస్పద మృతి: అల్లుడే చంపాడంటూ…

గొర్రెల మంద వద్ద పడుకున్న ఓరైతు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రావుల మల్లయ్య(60) అనే రైతు…  తన వ్యవసాయ భూమిలో అనుమానాస్పదంగా చనిపోయాడు. అయితే మల్లయ్యను అతని చిన్నల్లుడే చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు మల్లయ్య కుటుంబసభ్యులు. మృతుడు మల్లయ్యకు ముగ్గురు ఆడబిడ్డలు. ఇదివరకే ఇద్దరికి వివాహం అవగా…  8నెలల క్రితం మూడో అమ్మాయిని  ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామానికి చెందిన చిట్టె లింగస్వామికిచ్చి పెండ్లి చేశారు.

పెళ్లి అయినప్పటికీ నుండి మల్లయ్య చిన్న కూతురుని ఆమె భర్త లింగస్వామి వేధింపులకు గురిచేసేవాడని తెలిపారు అతని కుటుంబసభ్యులు. దీంతో పాటే మల్లయ్యను  అధిక కట్నం ఇవ్వమంటూ లింగస్వామి వేధించాడని… ఈ విషయం పై మల్లయ్యకు లింగ స్వామికి పలుమార్లు గొడవలు జరిగాయని చెప్పారు. అధిక కట్నం కోసం లింగస్వామి పెడుతున్న వేధింపులను తట్టుకోని మల్లయ్య శుక్రవారం రోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీంతో మల్లయ్యపై కక్ష కట్టి లింగస్వామే హత్యచేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.