జిల్లా కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం..

జిల్లా కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం..

రెవెన్యూ అధికారుల అండతో భూమి కబ్జా

తన భూమిని కబ్జా చేశారంటూ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన యాదయ్య అనే రైతు.. తన భూమిని కబ్జా చేశారంటూ చేశారు. ఎన్ని సార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అని అన్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేస్తున్నాను అంటూ తన ఆవేదనను చెప్పాడు. యాదిరెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ అధికారుల అండతో… తన తండ్రి పేరున ఉన్న భూమిని కాజేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు యాదయ్య.