జైత్‌రామ్‌ తండాలో ఘర్షణ.. ఇద్దరు కానిస్టేబుల్స్‌ సస్పెండ్

జైత్‌రామ్‌ తండాలో ఘర్షణ.. ఇద్దరు కానిస్టేబుల్స్‌ సస్పెండ్

ఆదిలాబాద్: ఉట్నూర్ మండలం, జైత్‌రామ్ తండాలో ఘర్షణకు కారణమైన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను పోలీసు వాఖ సస్పెండ్ చేసింది. కానిస్టేబుల్స్‌ సంజీవ్, రాథోడ్ బ్రహ్మానందంను సస్పెండ్ చేశామని ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. వారిద్దరిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని విష్ణు స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. తండాలో ఘర్షణలు పునరావృతం కాకుండా పకడ్బందీగా పోలీస్ పికెటింగ్ చేపడతామన్నారు. జైత్‌రామ్ తండాలో ప్రశాంత వాతావరణం కల్పించడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.