మోడీకి జనం ఓట్లేసింది డిగ్రీని చూసి కాదు : అజిత్ పవార్

మోడీకి జనం ఓట్లేసింది డిగ్రీని చూసి కాదు : అజిత్ పవార్

మోడీకి జనం ఓట్లేసింది డిగ్రీని చూసి కాదు!

ఆయన ఛరిష్మాను చూసే గెలిపించారు: అజిత్ పవార్

ముంబై : కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మోడీ చరిష్మా వల్లే ప్రజలు ఓట్లు వేశారు, 2014 ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించింది. అంతేకానీ మోడీ అకడమిక్ డిగ్రీలను చూసి కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ అన్నారు. ప్రధాని అకడమిక్ డిగ్రీ అంశం పెద్ద ప్రాబ్లమ్ కాదని.. దానికంటే ద్రవ్యోల్బణం తగ్గించడం, యువతకు ఉద్యోగాలు కల్పించడమే ముఖ్యమని వివరించారు.

ప్రతిపక్షాలు మోడీ విద్యార్హత అంశాన్ని లేవనెత్తడంపై అజిత్ పవార్ తాజాగా స్పందించారు.  ప్రజాస్వామ్యంలో డిగ్రీ కంటే పార్లమెంటులో మెజారిటీ ముఖ్యమని అన్నారు. రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాల ని ప్రతిపక్షాలను అజిత్ పవార్ కోరారు.