న్యూఢిల్లీ : మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరో హిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మిసైళ్లు తయారు చేయడం నుంచి మ్యూజిక్ దాకా మహిళల సేవలు అద్భుతమని కొనియాడారు. దేశాభివృద్ధి లోనూ వారి కృషిని అభినందించారు. ఢిల్లీలోని మానేక్షా సెంటర్లో ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్లో ‘నారీ శక్తి’ అంశంపై ఆమె మాట్లాడారు. ఓ సైనికుడి భార్యతో పాటు జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ టీచర్ తమ జీవితం లో ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు, అవమానాలు, అసమానతల గురించి మాట్లాడారు. సవాళ్లంటినీ దాటుకుని ఎలా ముందుకెళ్లారో ప్రోగ్రామ్లో వివరించారు. అంతకుముందు అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ద్రౌపది ముర్ము పరిశీలించారు.
