ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌కు ఫుల్ సెక్యూరిటీ : సీపీ సుధీర్ బాబు

ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌కు ఫుల్ సెక్యూరిటీ :  సీపీ సుధీర్ బాబు

  ఇండియా – ఇంగ్లాండ్ మధ్య ఈ నెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కల్పించాలని రాచకొండ సీపీ సుధీర్​బాబు పేర్కొన్నారు.  క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో బుధవారం ఉప్పల్ స్టేడియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ..  ప్రేక్షకులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నిరకాల సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

స్టేడియం పరిసరాల్లో సీసీ టీవీలు,  అవసరమైన వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ,  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్, సెక్రటరీ దేవరాజు, అడ్మిన్ డీసీపీ ఇందిర తదితరులు పాల్గొన్నారు.