ముగిసిన అడ్వకేట్ దంపతుల అంత్యక్రియలు

ముగిసిన అడ్వకేట్ దంపతుల అంత్యక్రియలు

హైకోర్టు లాయర్లు గట్టు వామన్ రావు, నాగమణి ల మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. ఈ మధ్యాహ్నం పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాలో పోస్టుమార్టమ్ పూర్తయ్యాక… డెడ్  బాడీలను తల్లిదండ్రులకు అప్పజెప్పారు పోలీసులు. సొంతఊరు గుంజపడుగుకు అంబులెన్స్ లో చేర్చారు. వారి ఇంట్లో సంప్రదాయం ప్రకారం కర్మకాండలు నిర్వహించారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బాధిత కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు. గుంజపడుగు గ్రామంలో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. వామనరావు, నాగమణి అంత్యక్రియలకు అడ్వకేట్లు భారీగా తరలి వచ్చారు.