
తెలంగాణలో కొత్త మంత్రులకు సెక్రటేరియట్ లో చాంబర్స్ కేటాయించింది జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్టెమెంట్. కార్మిక, మైనింగ్, జియోలజీ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ లోని 20,21,2 2 నంబర్ రూములను కేటాయించింది.
అలాగే అడ్లూరి లక్ష్మణ్ కు ఫస్ట్ ఫ్లోర్ లోని 13,14,15 నంబర్ గల రూములను కేటాయించారు. ఇక మంత్రి వాకిటి శ్రీహరికి సెకండ్ ఫ్లోర్ లోని 26,27,28 నంబర్ గల రూములను కేటయించింది ప్రభుత్వం.
ALSO READ | మంత్రిగా తొలిసారి చెన్నూరుకు వివేక్ వెంకటస్వామి.. భారీ ర్యాలీ.. అభిమానుల ఘనస్వాగతం.. !
జూన్ 8న మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన ముగ్గురికి జూన్ 11 రాత్రి ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఒక్కొ మంత్రికి రెండు శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక,మైనింగ్, ఉపాధిశాఖలు.. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్, కల్చర్ .. అడ్లూరి లక్ష్మణ్కుఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 19 నెలల తర్వాత కేబినెట్ను విస్తరించారు. సీఎం రేవంత్తో పాటు 15 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్లో సీఎం సహా 18 మందికి అవకాశం ఉంది. మరో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.