గడ్డిఅన్నారం మార్కెట్​ చైర్మన్​గా చిలుక మధుసూదన్ రెడ్డి

గడ్డిఅన్నారం మార్కెట్​ చైర్మన్​గా చిలుక మధుసూదన్ రెడ్డి

ఎల్బీనగర్/చేవెళ్ల, వెలుగు: గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్​గా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్​పూర్ కు చెందిన చిలుక మధుసూదన్​రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఏపీసీ సెక్రెటరీ ఎం.రఘునందన్ రావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే గండిచెరువుకు చెందిన సీహెచ్ భాస్కరాచారిని వైస్ చైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తమను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి మరింత ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు.

చేవెళ్ల మార్కెట్​కమిటీ చైర్మన్​గా పెంటయ్య గౌడ్ 

చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా గడ్డమీది పెంటయ్య గౌడ్, వైస్​ చైర్మన్​గా బ్యాగరి రాములును, 10 మందిని డైరెక్టర్లుగా నియమించింది.