పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో వైద్య సేవలు బాగున్నాయని, పేషెంట్లకు అధునాతన వైద్యం అందిస్తున్న డాక్టర్ల కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్నారు. గురువారం కమిషన్ మెంబర్లు శివాది ప్రవీణ, డాక్టర్ బి.కిషోర్తో కలిసి ఆయన గాంధీ హాస్పిటల్ను విజిట్ చేశారు. ఎమర్జెన్సీ వార్డును సందర్శించి పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.
జీరియాట్రిక్, పీడీయాట్రిక్ సర్జరీ వార్డులను సందర్శించారు. పిల్లల వార్డులో అధునాతన వైద్య సౌకర్యాలను చూసి మానవ హక్కుల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం సూపరింటెండెంట్చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ షమీమ్ అక్తర్ మాట్లాడారు.
గాంధీ ఆస్పత్రి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఇందిరా, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, ఆర్ఎంవోలు డాక్టర్ శేషాద్రి, డాక్టర్ యోగేందర్, చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, ఎస్హెచ్వో అనుదీప్, కమిషన్ కార్యదర్శి, సీఈవో
కాంతి వెస్లీ పాల్గొన్నారు.
