మందుబాబులు వీరంగం.. గాంధీ విగ్రహం ధ్వంసం.. ఎక్కడంటే

 మందుబాబులు వీరంగం.. గాంధీ విగ్రహం ధ్వంసం.. ఎక్కడంటే
  • మద్యం తాగొద్దని గాంధీ విగ్రహం పెడితే  
  • విగ్రహాన్నే ధ్వంసం చేసిన మందుబాబులు  

జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధి ప్రగతినగర్​లో అంబీర్​ చెరువు వద్ద గాంధీ విగ్రహాన్ని సోమవారం రాత్రి మందుబాబులు   ధ్వంసం చేశారు. ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా స్థానికులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కొంతమంది తాగు బోతులు, జులాయిలు పరిసరాలను అపరిశుభ్రం చేస్తుండటంతో స్థానికులు గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు.  

మందుబాబుల్లో  మార్పు వస్తుందని భావించారు. గాంధీ స్పూర్తిని తీసుకోవాల్సిన వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వసంచేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వసం చేసినవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితులు త్వరలో గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.