కోరుట్ల లో వినాయక విగ్రహ తయారీ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

కోరుట్ల లో వినాయక విగ్రహ తయారీ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

వినాయక విగ్రహాలను తీసుకెళ్లే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని కరీంనగర్- నిజమాబాద్ జాతీయ రహదారిపై విగ్రహ తయారీ కేంద్రాల నిర్వాహకులు, అందులో పని చేసే వర్కర్లు రాస్తారోకో కు దిగారు.దీంతో పోలీసులకు, విగ్రహ తయారీ కేంద్రాల నిర్వహకులకు వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని వారికి మద్దతు గా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ మూడు ఫీట్ల ఎత్తుగల విగ్రహాలను మాత్రమే ఇక్కడి నుండి పంపుతున్నారని, అంత కన్నా ఎక్కువ ఎత్తుగల విగ్రహాలను ఆపివేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇప్పటికే చాలా నష్టపోయామని..తయారీ చేసి బుకింగ్ అయిన వాటిని తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ఇప్పటికే భారీగా పెట్టు బడులు పెట్టి దివాలా తీశామని చెబుతున్నారు.