హాస్పిటల్ సమీపంలో మద్యం సేవించొద్దని చెప్పినందుకు తాగుబోతుల గ్యాంగ్ హాస్పిటల్ పై దాడి చేసింది. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేపీహెచ్బీ లోని రోడ్ నంబర్ 2 లోని ఎస్ ఎస్ ఆర్ హాస్పిటల్ వద్ద గల ఖాళీ స్థలంలో మందుబాబులు నిత్యం మద్యం సేవిస్తుంటారు.
2022 మే 24 బుధవారం రాత్రి కొంతమంది యువకులు మద్యం సేవిస్తుండగా హాస్పిటల్ లో డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్, నర్సు వారిని అక్కడ నుండి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు బీర్ బాటిళ్లు, రాళ్లతో హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు.
దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్, నర్సు పై దాడి చేశారు..ఈ ఘటనలో వారి తల, చేతులపై గాయాలయ్యాయి. హాస్పిటల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.