కర్నాటక నుంచి రాష్ట్రానికి గంజాయి.. ముగ్గురు అరెస్ట్, 2 కిలోల గాంజా సీజ్

కర్నాటక నుంచి రాష్ట్రానికి గంజాయి.. ముగ్గురు అరెస్ట్, 2 కిలోల గాంజా సీజ్

కొడంగల్, వెలుగు: కర్నాటక నుంచి తెలంగాణకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని కొడంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ మండలం రావులపల్లి చెక్ పోస్టు వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు వెహికల్ చెకింగ్ చేపట్టారు. బైక్ పై అనుమానాస్పదంగా కనిపించిన అఖిల్, దస్తప్ప, నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.

ఆ ముగ్గురు కర్నాటకలోని సేడం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద 2 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసమే గంజాయిని సప్లయ్ చేస్తున్నట్లు నిందితులు విచారణలో చెప్పారని పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.