
- గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్టు
- రూ.65 లక్షల విలువైన 166 కిలోలు స్వాధీనం
ఎల్బీనగర్, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, హయత్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద రూ.65 లక్షల విలువైన 166 కేజీల గంజాయి, కారు,4 ఫోన్లు, రూ.6,200 స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ లో రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన వికాస్ బాబన్, రంగనాథ్ యురాజన్ సాద్వే, సాగర్ గజానన్, అమోల్ నారాయణ్ బోర్డ్ ముఠాగా ఏర్పాడ్డారు. గురువారం ఒడిశాలో గంజాయి కొని మహారాష్ట్రలో అమ్మేందుకు హైదరాబాద్ మీదుగా ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్ లో వెళ్తున్నారు.
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, హయత్ నగర్ పోలీసులు ధనుంజయ ఫంక్షన్ హాల్ వద్ద వీరిని పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గంజాయి అమ్మిన ఒడిశాకు చెందిన మైక్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ షకీర్ హుస్సేన్, హయత్ నగర్ సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.