
మలక్పేట్లో ఒకటి
సరూర్నగర్లో మరోకటి
సిలిండర్ల వరుస పేలుళ్లతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మలక్ పేట, సరూర్ నగర్లలో శనివారం రాత్రి రెండు చోట్ల సిలిండర్ పేలుళ్లు జరిగాయి. ఈ రెండు ఘటనలలో కలిపి దాదాపు ఏడుగురు గాయపడ్డారు.
మలక్ పేటలో శనివారం రాత్రి ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అస్మాన్ ఘడ్లోని ఓ ఇంట్లో అర్థరాత్రి గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు దాటికి ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడ్డ వారిని గాంధీ హాస్పిటల్కు తరలించారు. గ్యాస్ లీకేజీకి తోడు ఇంట్లోని ఫ్రిడ్జ్ వెనక భాగంలోని థర్మోస్టేట్ షాట్ సర్క్యూట్ అవ్వడంతో పేలుడు జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పేలుడు దాటికి…ఇంట్లో ఉన్న వస్తువులు చెల్లా చెదురయ్యాయి. చుట్టు పక్కల ఇళ్లు, కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇక సరూర్నగర్ కోదండరాం నగర్లో కూడా శనివారం రాత్రి 2 గంటల సమయంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఇంట్లో గ్యాస్ లీకవుతున్న విషయం గమనించిన ఇంటి యజమాని.. భార్యాపిల్లల్ని బయటకు పంపించాడు. ఆ తర్వాత తన తమ్ముడితో కలిసి ఏం జరిగిందో చూద్దామని లోపలికి వెళ్లాడు. రూంలోకి వెళ్లి లైట్ వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో అన్నదమ్ములిద్దరికీ గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
For More News..