సిద్దిపేటలో గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళనలు

సిద్దిపేటలో గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళనలు

సిద్దిపేట జిల్లా: అక్కన్న పేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర  భూ నిర్వాసితులు నిరసనకు దిగారు. 18 ఏళ్లు నిండిన యువతి యువకులకు ఎనిమిది లక్షల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద ఒక్కో కుటుంబానికి 5లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు.

‘‘ఆరు లక్షలు రెడీ అయింది.. చెక్కు మీద సంతకం పెట్టమంటున్నారు.. 2 లక్షలు స్కీం అంటున్నారు.. ఇలా వాయిదాలు కాకుండా ఒకేసారి 8 లక్షలు ఇవ్వాలి..’’ అని నిర్వాసితులు డిమాండ్ చేశారు. 15 సంవత్సరాల నుంచి శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే పట్టించుకోకుండా పోలీసు బలగాలను దించి పనులు చేయించుకోవాలని చూడడం సహించబోమన్నారు. మాకు ఇవ్వాల్సిన పరిహారం చెల్లించే వరకు నిరసన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని నిర్వాసితులు తేల్చి చెప్పారు. పరిహారం ఇవ్వకపోతే ప్రాజెక్టు పనులు జరగనివ్వమని హెచ్చరించారు.