ENG vs IND 2025: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా ఆడేది రెండు టెస్టులే

ENG vs IND 2025: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా ఆడేది రెండు టెస్టులే

లీడ్స్ వేదికగా హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత టీమిండియా ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిరీస్ లోని మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో రెండే టెస్టులు ఆడనున్నాడు. ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ అధికారికంగా ధృవీకరించాడు. ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత మాట్లాడిన గంభీర్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. దీంతో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. వాస్తవానికి బుమ్రా సిరీస్ కు ముందు అన్ని టెస్టులు ఆడలేనని చెప్పాడు. అయితే సిరీస్ ప్రారంభం అయిన తర్వాత బుమ్రా తాను మూడు టెస్టులే ఆడతానని అధికారికంగా ఎప్పుడూ చెప్పలేదు.

బుమ్రా ప్రదర్శన చూస్తుంటే ఈ స్టార్ పేసర్ అన్ని టెస్టులు ఆడితే బాగుండు అని ప్రతి భారత క్రికెట్ ఫ్యాన్ కోరిక. అయితే బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు అవకాశం లేకపోవడంతో ఈ సిరీస్ లో భారత్ ఎలా నెట్టుకు వస్తుందో ఆసక్తికరంగా మారింది. గంభీర్ మాట్లాడుతూ.. "బుమ్రా పనిభారాన్ని పెంచే ఆలోచనలో మేము లేము. అతనికి రెస్ట్ ఇవ్వడం మాకు చాలా ముఖ్యం. ఇంకా అతనిలో చాల క్రికెట్ ఉంది. ఈ పర్యటనకు రాకముందే, అతను మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలని ఇప్పటికే నిర్ణయించారు. అతని శరీరం ఎలా సహకరిస్తుందో చూడాలి. బుమ్రా మిగిలిన నాలుగు టెస్టుల్లో ఏ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడతాడో మేము నిర్ణయించలేదు." అని గంభీర్ అన్నాడు. 

ఇంగ్లాండ్ పై 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుమ్రా తొలి టెస్ట్ ఆడేశాడు. మిగిలిన నాలుగు టెస్టుల్లో రెండు టెస్టులు మాత్రమే ఆడనున్నాడు. తొలి టెస్టులో ఓడిపోయిన భారత జట్టుకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్   తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. రెండో రోజు ఆటలో భాగంగా మూడు కీలక వికెట్లు తీసుకోగా.. మూడో రోజు మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ కెరీర్ లో 14 వ సారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఓవరాల్ గా బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 24.4 ఓవర్లు బౌలింగ్ చేసి 83 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 

కామెంట్రీలో భాగంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ది వాల్ చటేశ్వర్ పుజారా బుమ్రా సిరీస్ లోని అన్ని టెస్టుల ఆడాలనే తమ కోరికను బయటపెట్టారు. బుమ్రా ఈ సిరీస్ లో ఐదు ఆడేలా ఒప్పించాలని బుమ్రా భార్య సంజన గణేషన్‌ ను కోరారు. పనిభారం ఉన్నప్పటికీ అతను సిరీస్ మొత్తం ఆడాలని తమ వాదనను వినిపించారు. వీరి మాటలకు సంజయ్ గణేశన్ నవ్వుకున్నారు. బుమ్రాను తన భార్య ఐదు టెస్టులు ఆడాలని కోరినా ఈ ఫాస్ట్ బౌలర్ ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం అని సమాధారం చెప్పకుండా దాటేశాడు.