గీతాంజలి(Geethanjali).. అంజలి(Anjali) హీరోయిన్ గా 2014లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను రాజ్ కిరణ్ తెరకెక్కించగా.. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్, రావు రమేష్ రావు ప్రధాన పాత్రల్లో కనిపించారు. దాదాపు పదేళ్ళ తరువాత గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ అందించిన ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కించాడు.
టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. ఇక సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్న కారణంగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Akka nv malli vachavaa...!😯
— ahavideoin (@ahavideoIN) May 6, 2024
Sare aha lo kaluddam...🙂#GeethanjaliMalliVachindhi premieres May 08. #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati #SujathaSiddarth @Actorysr @Satyamrajesh2 @suneeltollywood #Satya #ShakalakaShankar #Ali #RahulMadhav… pic.twitter.com/tMKXtv3UIi
ఈ సినిమాను ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న ఆహా తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సినిమాను మే 8 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. నిజానికి ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రకటనతో హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో ఓ మోస్తారు విజయాన్ని సాదించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి