ఘట్కేసర్ బీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ కేసులో ట్విస్ట్..

ఘట్కేసర్ బీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ కేసులో ట్విస్ట్..

కిడ్నాప్ డ్రామాతో సంచలనం రేపిన ఘట్కేసర్ బీంఫార్మాసీ విద్యార్థిని కేసులో మరో  ట్విస్ట్. ఆ యువతి షుగర్ ట్యాబ్లెట్స్ మింగి సూసైడ్ చేసుకుంది. మంగళవారం మద్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థినిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. యువతికి వైద్యం అందించి ఇంటింకి పంపించారు. బుధవారం ఉదయం మరొసారి తండ్రి దగ్గర ఉన్నఆరు షుగర్ మాత్రలు మింగింది విద్యార్థిని. పరిస్థితి విషమించడంతో ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాలేజీ నుంచి వస్తున్న తనను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేశారంటూ యువతి పోలీసులకు చెప్పింది. అయితే పోలీసుల దర్యాప్తులో యువతి చెప్పిదంతా కట్టుకథ అని తేలింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారనే మనస్తాపంతో విద్యార్థిని షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.