బంద్​కు పిలుపునిచ్చిన జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు

బంద్​కు పిలుపునిచ్చిన జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు

హైదరాబాద్, వెలుగు : ఈ నెల 18 నుంచి బంద్ పాటిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు అప్పుల పాలవుతున్నారని వాపోయారు. 18 నుంచి పనులు బంద్​చేస్తామని, కొత్తగా ఎలాంటి పనులు చేపట్టబోమని స్పష్టం చేశారు.