హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ ఏటా నిర్వహించే సమ్మర్కోచింగ్క్యాంపులు మొదలయ్యాయి. గురువారం కేపీహెచ్ బీ కాలనీ గ్రౌండ్, చందానగర్లోని పీజేఆర్గ్రౌండ్లో కమిషనర్రోనాల్డ్రోస్ ప్రారంభించారు. మే 31 వరకు ఈ క్యాంపులు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్మాట్లాడుతూ.. పిల్లలకు చదువుతోపాటు క్రీడలు అవసరమని, నచ్చిన క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.
ఈసారి కూడా 44 క్రీడల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 6 నుంచి 16 ఏండ్ల పిల్లలు పాల్గొనవచ్చని చెప్పారు. ప్రతిభను వెలికి తీయడంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించేలా క్రీడలను ప్లాన్చేశామన్నారు. శిక్షణ ఇవ్వడానికి కోచ్ లను, మెటీరియల్ ను అందుబాటులో ఉంచామని తెలిపారు. జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, స్పోర్ట్స్ విభాగం అధికారులు, క్రీడాకారులు, చిన్నారులు, తల్లిదండ్రులు, కోచ్లు పాల్గొన్నారు.