
ములుగు, వెలుగు : పాముకాటుతో బుధవారం రాత్రి ఓ బాలిక ములుగు జిల్లా దవాఖానకు రాగా బెడ్లు ఖాళీ లేవంటూ ఆమెను కుర్చీపై కూర్చోబెట్టి ట్రీట్మెంట్ఇచ్చారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన గుండెబోయిన నాగలక్ష్మి, అనిల్దంపతుల బిడ్డ సాహితీ బుధవారం రాత్రి ఇంటివద్ద ఉండగా పాము కాటేసింది. దీంతో ఆమెను ములుగు జిల్లా దవాఖానకు తీసుకువచ్చారు. అయితే, బెడ్లు ఖాళీ లేవని చెప్పిన సిబ్బంది ఆమెను స్టూల్ పై కూర్చోబెట్టి సెలైన్ బాటిల్ ఎక్కించారు.
తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నించగా చిన్నపిల్లల వార్డు, జనరల్వార్డులు ఫుల్అయ్యాయని, అందుకే ఇలా ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పారు. చివరకు తెల్లవారుజామున ఐసీయూలో బెడ్ ఖాళీ కావడంతో అందులో జాయిన్ చేసుకున్నారు. గురువారం సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో పెట్టి కోలుకోవడంతో ఇంటికి పంపారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్ ను వివరణ కోరగా సీజనల్ వ్యాధులతో దవాఖానలో 100 బెడ్స్ ఖాళీగా లేవని, అయినా కూడా ఎవరినీ బయటకు పంపకుండా చికిత్స చేస్తున్నామన్నారు. గురువారం కూడా 130మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పారు.