జేఎన్టీయూలో గ్లోబల్ అలూమ్ని మీట్

జేఎన్టీయూలో గ్లోబల్ అలూమ్ని మీట్
  •     ఇయ్యాల్టి నుంచి రెండ్రోజులు నిర్వహణ
  •      ప్రారంభించనున్న గవర్నర్​ తమిళిసై 

మాదాపూర్, వెలుగు : కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో ఇయ్యాల్టి నుంచి రెండు రోజులు గ్లోబల్​ అలుమ్ని మీట్ ​నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జేఎన్టీయూ ఓల్డ్ స్టూడెంట్లను ఆహ్వానించడం, వర్సిటీతో చదివిన రోజులను  గుర్తు చేసుకోవడం మీట్​లక్ష్యమని పేర్కొన్నారు.  ప్రస్తుత స్టూడెంట్లకు, ఓల్డ్ స్టూడెంట్లకు విజయాలను తెలియజేయడం ఉంటుందని చెప్పారు. 

5 నెలల వ్యవధిలో 1,600 మంది ఓల్డ్ స్టూడెంట్లు రిజిస్ర్టేషన్​ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్సలర్ తమిళిసై శుక్రవారం ఉదయం10 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తారని ప్రసంగిస్తారన్నారు.  అనంతరం మెకానికల్ ​ఇంజనీరింగ్​ డిపార్ట్​మెంట్​లో సెమినార్ ​హాల్, హెల్త్​సెంటర్​లో బ్లడ్ ​డొనేషన్​ క్యాంప్​, రెనోవేషన్​ చేసిన కృష్ణ హాస్టల్​ను ఓపెన్ చేస్తారని తెలిపారు. 

రెండో రోజు శనివారం కల్చరల్, స్పోర్ట్స్​ ఇతర ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు. జేఎన్టీయూ ఈఈఈ 1971 బ్యాచ్​కు చెందిన లోహియా ఎడిబల్​ఆయిల్​ ప్రై. లి కంపెనీ చైర్మన్​ కన్హయ్యలాల్​ లోహియా అలుమ్ని ఫౌండేషన్​కు రూ. కోటి రూపాయల ఫండ్​ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో వర్సిటీ రెక్టార్ ​గోవర్ధన్, రిజిస్ర్టార్ ​మంజూర్​ హుస్సేన్​ ఉన్నారు.