హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘శంషాబాద్ ఎయిర్పోర్టులో కుక్కలు, ఎలుకలు’ వార్తపై జీఎంఆర్ అధికారులు స్పందించారు. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోకి కుక్కలు రాకుండా క్రమం తప్పకుండా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టు ప్రాంగణంలో కుక్కలు, ఎలుకలు లేవన్నారు.
2026 జనవరి నుంచి ఇప్పటివరకు 21 వీధి కుక్కలను తరలించినట్లు చెప్పారు. వ్యర్థాల నిర్వహణ విధానాలను మరింత కట్టుదిట్టం చేశామని, మూత ఉన్న డస్ట్బిన్లలోనే వ్యర్థాలను పారవేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు నివారణ చర్యలను అమలు చేయనున్నట్లు చెప్పారు.
