జగదాంబిక హుండీ ఆదాయం రూ.2.91లక్షలు

జగదాంబిక హుండీ ఆదాయం రూ.2.91లక్షలు

మెహిదీపట్నం, వెలుగు : గోల్కొండ శ్రీజగదాంబిక(ఎల్లమ్మ తల్లి) అమ్మవారి ఆలయ హుండీలను దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం లెక్కించారు. రూ.2,91,940 సమకూరినట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ రాజు, ఆలయ కమిటీ చైర్మన్ కాంత అరవింద్ మహేశ్​కుమార్ తెలిపారు.

బోనాలు ఉత్సవాల్లోని మొదటి, రెండు పూజల్లో పాల్గొన్న భక్తులు కానుకల రూపంలో ఈ మొత్తం సమర్పించినట్లు చెప్పారు. హుండీల లెక్కింపులో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.