
Gold Price Today: ఈ వారం ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేటు అకస్మాత్తుగా వినాయక చవితికి ముందు మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. భారతదేశంపై అదనపు టారిఫ్స్ ఆగస్టు 27 నుంచి అమలులోకి రాబోతున్న వేళ అంతర్జాతీయంగా వాణిజ్య ప్రభావాన్ని ఇన్వెస్టర్లు పరిగణలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. పండుగకు షాపింగ్ చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని తమ నగరాల్లో రేట్లను పరిశీలించటం ముఖ్యం. పండుగకు ముందు రేట్ల పెరుగుదలతో చాలా మంది కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే ఆగస్టు 25తో పోల్చితే 10 గ్రాములకు ఆగస్టు 26న రూ.55 పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లను పరిశీలిస్తే..
ALSO READ : అమెరికా నుంచి టారిఫ్స్ నోటీసులు..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(ఆగస్టు 26న):
- హైదరాదాబాదులో రూ.10వేల 206
- కరీంనగర్ లో రూ.10వేల 206
- ఖమ్మంలో రూ.10వేల 206
- నిజామాబాద్ లో రూ.10వేల 206
- విజయవాడలో రూ.10వేల 206
- కడపలో రూ.10వేల 206
- విశాఖలో రూ.10వేల 206
- నెల్లూరు రూ.10వేల 206
- తిరుపతిలో రూ.10వేల 206
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఆగస్టు 20తో పోల్చితే ఇవాళ అంటే ఆగస్టు 26న 10 గ్రాములకు రూ.50 పెరుగుదలను చూసింది. దీంతో ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(ఆగస్టు 26న):
- హైదరాదాబాదులో రూ.9వేల 355
- కరీంనగర్ లో రూ.9వేల 355
- ఖమ్మంలో రూ.9వేల 355
- నిజామాబాద్ లో రూ.9వేల 355
- విజయవాడలో రూ.9వేల 355
- కడపలో రూ.9వేల 355
- విశాఖలో రూ.9వేల 355
- నెల్లూరు రూ.9వేల 355
- తిరుపతిలో రూ.9వేల 355
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా ర్యాలీని కొనసాగిస్తోంది. ఆగస్టు 26న కేజీకి వెండి రూ.వెయ్యి తగ్గుదలను నమోదు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 30వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.130 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.