శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం ఉదయం రసల్ కైమా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ముగ్గురు ప్యాసింజర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ముగ్గురి లగేజీ బ్యాగ్ లను తనిఖీ చేయగా.. 1663 గ్రాముల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ. 99 లక్షల 57 వేల 640 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముగ్గురిపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.