ఎయిర్​పోర్ట్​ అథారిటీ రిపోర్టుకు.. సర్కార్​ నో రెస్పాన్స్

ఎయిర్​పోర్ట్​ అథారిటీ రిపోర్టుకు.. సర్కార్​ నో రెస్పాన్స్

ఆరు ఎయిర్​పోర్టులకు మూడు ఓకే చేసిన ఎయిర్​అథారిటీ
స్టేట్​కే నిర్ణయాన్ని వదిలేసిన కేంద్ర ప్రభుత్వం

పెద్దపల్లి, వెలుగు: రాష్ట్ర సర్కార్​ కేంద్ర విమానయాన శాఖకు గత సంవత్సరం 6 ఎయిర్​పోర్టుల నిర్మాణానికి ప్రపోజల్స్​పంపించింది. ప్రపోజల్స్​పరిశీలించిన ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించి గత డిసెంబర్​లో రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజిబిలిటీ రిపోర్ట్​ను అందజేసింది. తొమ్మిది నెలలైనా ఇప్పటివరకు ఫీజిబిలిటీ రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం ఫుల్​ఫిల్​ చేయలేదు. ఎలాంటి రెస్పాన్స్​ఇవ్వలేదు. కేంద్ర విమానయాన శాఖ సైతం తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. మొత్తం ఆరింటిలో 3 మాత్రమే అన్ని రకాలుగా తగిన విధంగా ఉన్నాయని ఎయిర్ పోర్టు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వివిధ దఫాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేసిన కేంద్ర బృందాలు వరంగల్​ లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి మాత్రమే పూర్తిస్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్​ నగర్​లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్​లు ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు, పెద్ద విమాన రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని భారత విమానయాన సంస్థకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నాయి.
ఫీజిబిలిటీ రిపోర్టులో ఏముంది..
కేంద్ర వియానయానశాఖ రాష్ట్రాలకు అనుకూల ప్రదేశాల్లో ఎయిర్​పోర్ట్​లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించింది. దాంట్లో భాగంగానే తెలంగాణ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా 6 ఎయిర్​పోర్టుల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఎయిర్​ పోర్ట్​ అథారిటీ ఆఫ్ ఇండియా గత డిసెంబర్​లో ఫీజిబిలిటీ రిపోర్ట్​ను స్టేట్​గవర్నమెంటుకు పంపింది. దీని ప్రకారం రన్​వే, ఐసోలేషన్​బే, జీఎస్ఈ ఏరియా, పెరిమీటర్​రోడ్, బౌండరీ వాల్,  డ్రైన్స్, టెర్మినల్​ బిల్డింగ్, ఫైర్​స్టేషన్, ఏటీసీ టవర్, కార్​పార్కింగ్, ఎలక్ట్రిక్​సబ్​స్టేషన్, ఫ్యూయల్​డిపో, నావిగేషన్​ఎయిడ్, జీఎల్ఎఫ్​ లాంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ రిపోర్టును పంపాలి. 
ఏర్పాటు బాధ్యత రాష్ట్రాలదే
డిజిన్వెస్ట్​మెంటుతో  కేంద్రం ఇప్పటికే కొన్ని ఎయిర్​పోర్టులను ప్రైవేటుకు అప్పగించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కొత్త ఎయిర్​పోర్టులను ఏర్పాటు చేసే ఆలోచనను కేంద్రం విరమించుకుంది. కొత్తగా ఎక్కడైనా ఏర్పాటు చేయాలనుకుంటే పూర్తి బాధ్యత ఆ రాష్ట్రాలే తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్​పోర్ట్​సెక్యూరిటీ, కమ్యూనికేషన్​లు మాత్రం కేంద్రం ఆధీనంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆప్షన్లను రాష్ట్రాలకు ఇచ్చింది. ఎయిర్​పోర్టులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నడిపించుకోవడం, పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం, భాగస్వామ్యంతో అయినా నడిపించుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, మహబూబ్​నగర్,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎయిర్​పోర్ట్​లు ఏర్పాటుకు చాలా రోజుల నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి.  ఈ ఆరు జిల్లాల్లో వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్​జిల్లాల్లో ఎయిర్​పోర్ట్​ ఏర్పాటుకు పరిసరాలు అనుకూలంగా ఉన్నట్లు సర్వే చేసిన ఎయిర్​పోర్ట్​ అథారిటీ గత డిసెంబర్​లోనే ఆమోదం తెలిపింది. అయినా ఇప్పటివరకు స్టేట్​ గవర్నమెంటు ఆయా జిల్లాల్లో ఎయిర్​పోర్ట్​ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు. 

రాష్ట్ర సర్కారు రెస్పాండ్​కాలే
ఎయిర్​పోర్ట్​ ఫీజిబిలిటీ రిపోర్టు పుల్​ఫిల్​చేయడంపై రాష్ట్ర సర్కారు స్పందించడం లేదు. స్టేట్​ మొత్తం ఆరు ఎయిర్​పోర్ట్​లు నిర్మించడానికి చాలాకాలం కిందటే ప్రపోజల్స్​వచ్చాయి. గత సంవత్సరం ఆరు ఎయిర్​పోర్ట్​ స్థలాలను సర్వే చేసి డిసెంబర్​లో స్టేట్​గవర్నమెంటుకు ఫీజిబిలిటీ రిపోర్ట్​అందజేశాం. ఆరింట్లో ఇన్​స్టంట్​గా మూడు ఎయిర్​పోర్ట్​లను నిర్మించుకోవచ్చు. మిగతా మూడు ఫీజిబిలిటీకి అనుగుణంగా మార్చితే అక్కడ కూడా నిర్మాణ చేపట్టవచ్చు. కేంద్రం ఎయిర్​పోర్ట్​ నిర్మాణాల పూర్తి బాధ్యత రాష్ట్రాలకే ఇచ్చేసింది. ప్రభుత్వ ఆధీనంలోనా, లేక ప్రైవేటుకు అప్పగించుకోవడమా అనేది స్టేట్​తేల్చుకోవాల్సి ఉంటుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కన్పించడం లేదు. 
                                                                                                                                                                                 – కాసం వెంకటేశ్వర్లు, డైరెక్టర్, ఎయిర్​పోర్ట్​ అథారిటీ