
బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కియారా అద్వానీ.. మరోవైపు సౌత్లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే రామ్ చరణ్కు జంటగా ‘గేమ్ చేంజర్’లో నటిస్తున్న ఆమె, తాజాగా మరో సౌతిండియన్ ప్రాజెక్ట్లో చాన్స్ అందుకుంది. యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైనట్టు సమాచారం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇందులో హీరోయిన్ పాత్రకు కరీనా కపూర్, సాయిపల్లవి తదితరులు పేర్లు వినిపించాయి. నయనతార కీలకపాత్ర పోషించనుందనే టాక్ కూడా వినిపించింది. కానీ ఇవేవి నిజం కాలేదు. తాజాగా కియారా అద్వానీ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది.
‘కేజీయఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న చిత్రం కావడంతో అనౌన్స్మెంట్ రోజు నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు గాను గురువారం ఫ్రాన్స్కు ప్రయాణమైంది కియారా అద్వానీ.