రెండో ఉద్దీపన ప్యాకేజీకి రెడీ అవుతున్న కేంద్రం

రెండో ఉద్దీపన ప్యాకేజీకి రెడీ అవుతున్న కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బలహీనపడిన ఎకానమీని పరిపుష్టం చేసేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం.. ఎకానమీని పరిపుష్టం చేసేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీని ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న తరుణ్ బజాజ్ తెలిపారు. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ఐదు నెలల కిందట ఆత్మనిర్భర్ భారత్ పేరుతో రూ.21 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రెండో ఉద్దీపన ప్యాకేజీ ఉంటుందని క్లూ ఇచ్చారు.