
యాదాద్రి, వెలుగు : ఈనెల 12న యాదాద్రి జిల్లాకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. చేనేత, పట్టు వస్త్రాలకు ప్రసిద్ది చెందిన భూదాన్ పోచంపల్లిలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటారు.
అనంతరం టూరిజం పార్క్ను ఆయన సందర్శిస్తారు. మంగళవారం భూదాన్ పోచంపల్లిలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు పర్యవేక్షించారు. అడిషనల్కలెక్టర్భాస్కర్రావుతో కలిసి గవర్నర్ పర్యటనపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని అధికారులను ఆదేశించారు.