ప్రధాని మోడీతో గవర్నర్ తమిళిసై భేటీ

ప్రధాని మోడీతో గవర్నర్ తమిళిసై భేటీ

హస్తిన టూర్లో ఉన్న  రాష్ట్ర గవర్నర్ తమిళిసై.... కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఉదయం పార్లమెంట్ కు వెళ్లిన తమిళి సై ప్రొటోకాల్ ఇష్యూస్ పై ప్రధాని కి కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా గవర్నర్ మోడీతో చర్చిస్తున్నట్టు సమాచారం. 

మోడీతో భేటీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి హోంశాఖకు తమిళి సై రిపోర్ట్ ఇస్తారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ను ఆహ్వానించడం లేదు ప్రభుత్వం. సర్కార్ కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా సెషన్ మొదలుపెట్టింది ప్రభుత్వం. మేడారం జాతరకు, యాదాద్రి ప్రారంభానికి కూడా గవర్నర్ కు కనీసం ఆహ్వానం అందలేదు. ఇక రాజ్ భవన్లో ఉగాది వేడుకలకు సీఎం, మంత్రులు, అధికార పార్టీ నేతలను ఆహ్వానించినా... ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. గవర్నర్ జిల్లాల పర్యటనలకు వెళ్లినా ఉన్నతాధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.  ఈ సిచ్చువేషన్ లో గవర్నర్ ఢిల్లీ పర్యటన, హోంమంత్రితో భేటీ అవుతుండడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాఫిక్ అయ్యింది.

 

దేశ యువతను కుటుంబ పార్టీలు ఎదగనిస్తలే