తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ఇవాళ ఉదయం ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయనాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.అనంతరం..ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ్ మందిర్అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. దేశ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలు బాగుకోసం భగవంతుడిని ప్రార్థించినట్లు తమిళి సై చెప్పారు.
జనవరి 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాలను శుభ్రం చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆలయాలను శుభ్రం చేస్తున్నారు.