గ్రామీణ ప్రాంతాల్లో  కిడ్నీ సమస్యలపై అవగాహన కల్పించాలి: గవర్నర్​తమిళిసై

 గ్రామీణ ప్రాంతాల్లో  కిడ్నీ సమస్యలపై అవగాహన కల్పించాలి: గవర్నర్​తమిళిసై
  • క్రిటికల్ కేర్​నెఫ్రాలజీ’పై జరిగిన అంతర్జాతీయ సదస్సుకు 
  • చీఫ్​గెస్ట్ గా హాజరునెఫ్రాలజీ డాక్టర్లు లైఫ్​సేవర్లని కామెంట్​

మాదాపూర్, వెలుగు: అప్పుడే పుట్టిన బిడ్డ లాంటి తెలంగాణ రాష్ర్టానికి తనను గవర్నర్​గా నియమించడంపై కొందరు విమర్శలు చేశారని, ఎంత వరకు మ్యానేజ్​చేస్తుందని ఎద్దేవా చేశారని తెలంగాణ రాష్ర్ట గవర్నర్​ డా. తమిళిసై అన్నారు. తాను గైనకాలజీ డాక్టర్ గా అప్పుడే పుట్టిన బిడ్డలను మ్యానేజ్ చేస్తానని, అలాగే కొత్త రాష్ర్టానికి గవర్నర్​గా కూడా బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు.

గతంలో ప్రజలు అనారోగ్య సమస్యలు వస్తే డాక్టర్​ను కన్సల్ట్​అయ్యే వారని, ప్రస్తుతం గూగుల్​లో సర్చ్​చేస్తున్నారని గవర్నర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కిడ్నీ సమస్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శనివారం హైటెక్​సిటీలోని యశోదా ఆసుపత్రిలో అత్యాధునిక ‘క్రిటికల్ కేర్​ నెఫ్రాలజీ’పై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు గవర్నర్​ ముఖ్య అతిథిగా హాజరై యశోదా ఎండీ జీఎస్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్​మాట్లాడుతూ.. తన భర్త నెఫ్రాలజీ డాక్టర్​గా పనిచేస్తున్నప్పుడు తాను కూడా నెఫ్రాలజీ యూనిట్​ను మానిటర్ చేశానని పేర్కొన్నారు. నెఫ్రాలజీ డాక్టర్లు లైఫ్​ సేవర్స్​అని, తన భర్త నెఫ్రాలజీ డాక్టర్​ కావడంతో తనకు ఆ విభాగంలో ఉండే సమస్యలు తెలుసు అని గవర్నర్​చెప్పారు. సీనియర్​నెఫ్రాలజీ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి మాట్లాడుతూ... దేశంలో ప్రస్తుతం17 శాతం జనాభా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరూ రెగ్యులర్​గా కిడ్నీ పనితీరును పరీక్షించుకోవాలని సూచించారు.