
- క్రిటికల్ కేర్నెఫ్రాలజీ’పై జరిగిన అంతర్జాతీయ సదస్సుకు
- చీఫ్గెస్ట్ గా హాజరునెఫ్రాలజీ డాక్టర్లు లైఫ్సేవర్లని కామెంట్
మాదాపూర్, వెలుగు: అప్పుడే పుట్టిన బిడ్డ లాంటి తెలంగాణ రాష్ర్టానికి తనను గవర్నర్గా నియమించడంపై కొందరు విమర్శలు చేశారని, ఎంత వరకు మ్యానేజ్చేస్తుందని ఎద్దేవా చేశారని తెలంగాణ రాష్ర్ట గవర్నర్ డా. తమిళిసై అన్నారు. తాను గైనకాలజీ డాక్టర్ గా అప్పుడే పుట్టిన బిడ్డలను మ్యానేజ్ చేస్తానని, అలాగే కొత్త రాష్ర్టానికి గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు.
గతంలో ప్రజలు అనారోగ్య సమస్యలు వస్తే డాక్టర్ను కన్సల్ట్అయ్యే వారని, ప్రస్తుతం గూగుల్లో సర్చ్చేస్తున్నారని గవర్నర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కిడ్నీ సమస్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శనివారం హైటెక్సిటీలోని యశోదా ఆసుపత్రిలో అత్యాధునిక ‘క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ’పై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై యశోదా ఎండీ జీఎస్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్మాట్లాడుతూ.. తన భర్త నెఫ్రాలజీ డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు తాను కూడా నెఫ్రాలజీ యూనిట్ను మానిటర్ చేశానని పేర్కొన్నారు. నెఫ్రాలజీ డాక్టర్లు లైఫ్ సేవర్స్అని, తన భర్త నెఫ్రాలజీ డాక్టర్ కావడంతో తనకు ఆ విభాగంలో ఉండే సమస్యలు తెలుసు అని గవర్నర్చెప్పారు. సీనియర్నెఫ్రాలజీ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి మాట్లాడుతూ... దేశంలో ప్రస్తుతం17 శాతం జనాభా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా కిడ్నీ పనితీరును పరీక్షించుకోవాలని సూచించారు.