మాగంటికి నివాళి..కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్

మాగంటికి నివాళి..కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భౌతిక కాయానికి మాజీ సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. గోపినాథ్ భౌతిక కాయాన్ని చూసిన కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

అనారోగ్యంతో కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భౌతిక కాయాన్ని  మాదాపూర్ కావూరి హిల్స్ లోని తన నివాసానికి తరలించారు. జూన్ 8న  సాయంత్రం 4 గంటలకు మహా ప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరగనున్నాయి.  ప్రభుత్వ అధికార లాంచనాలతో మాగంటి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మాగంటి గోపినాథ్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఐఏజీ ఆస్పత్రిలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేపించుకున్నారు. మళ్లీ గుండెపోటు రావడంతో జూన్ 5న కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడు రోజులుగా వెంటిలెటర్ పైనే మాగంటికి చికిత్స అందించారు డాక్టర్లు.  ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.