మన్నెగూడ ఘటనపై గవర్నర్ తమిళిసై ట్వీట్

మన్నెగూడ ఘటనపై గవర్నర్ తమిళిసై ట్వీట్

మన్నెగూడలో జరిగిన యువతి కిడ్నాప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని  అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసులు గూండాల నుంచి యువతికి ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు  భద్రత కల్పించాలని గవర్నర్ ఆదేశించారు.  

అటు ఇబ్రహీంపట్నం ఎంఎల్ ఏ మంచి రెడ్డి కిషన్ రెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యలను పరామర్శించారు. ఘటన గురించి బాధితురాలి తండ్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడినవారిని అవసరమైన చికిత్స అందిస్తున్నారు.