గవర్నర్‌ తమిళిసై ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందా?

గవర్నర్‌ తమిళిసై ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందా?

తెలంగాణ  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్‌(ఎక్స్‌) అయిందని  తెలుస్తోంది.  దీంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు రాజ్‌భవన్‌ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమిళిసై సౌందరరాజన్  ట్విట్టర్‌ హ్యాండిల్ లో ఆమె డీపీ ఉంటుంది. దానిని తొలిగించారు. అంతేకాకుండా బ్లూటిక్ కూడా పోయింది. అధికారుల ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ మధ్య రాజకీయ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి.  అందులో సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు.  ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ అకౌంట్ ను కేటుగాళ్లు హ్యాక్  చేశారు. దీనిపై ఆయన   సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు  కంప్లైట్ చేశారు.