చార్టెడ్ అకౌంటెన్సీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు హైదరాబాద్ వేదికవడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సును గవర్నర్ ప్రారంభించారు.
ఇలాంటి కాన్ఫరెన్సులు స్టూడెంట్స్ నాలెడ్జ్ పెంచడానికి ఉపయోగపడుతాయన్నారు. ఈ కాన్ఫరెన్స్ కు దేశం నలు మూలల నుంచి స్టూడెంట్స్ రావడం మంచి పరిణామం అని మెంబర్ చెంగల్ రెడ్డి అన్నారు. సీఏ కోర్సు చేస్తున్న వారికి అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలున్నాయన్నారు.