ఈ-సిగరెట్లను నిషేధించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర నిర్ణయంతో ఈ-సిగరెట్లకు సంబంధించిన తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వలు, ప్రకటనలను కూడా నిషేదిస్తున్నట్లు చెప్పారు. యువతలో 77 శాతం ఈ -సిగరెట్లు వాడుతున్నారని..ఇకపై ఈ- సిగరెట్లు వాడటం నేరమని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకొస్తామని చెప్పారు.