గ్రేటర్వ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు కలర్ ఫుల్గా జరిగాయి. సిటీలోని చర్చిల దగ్గర ఒకరినొకరు విష్ చేసుకుంటూ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు క్రైస్తవులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మియాపూర్లోని కల్వరి టెంపుల్, బొల్లారంలోని హోలీ ట్రినిటీ, సికింద్రాబాద్లోని వెస్లీ, సెయింట్ మేరీస్, ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా, అబిడ్స్, బంజారాహిల్స్, బోయిగూడ, బీఎన్ రెడ్డి నగర్ చర్చిల్లో ఉదయం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
కొన్ని చర్చిలలో ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు, బిషప్లు క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు. అబిడ్స్ చాపెల్ రోడ్లోని సెంటినరీ మెథడిస్ట్ చర్చిలో జరిగిన ప్రార్థనలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. సనత్నగర్లోని మెథడిస్ట్ చర్చిలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేశారు.
వికారాబాద్ చర్చిలో జరిగిన వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. లిబర్టీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసులో, చేవెళ్లలోని దామరగిద్దలో, జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో క్రిస్మస్ వేడుకలు జరిగాయి.