కరెంట్ షాక్ తో తాత మనవరాలు మృతి..

కరెంట్ షాక్ తో తాత మనవరాలు మృతి..

కరెంట్ షాక్ తో తాత మనవరాలు మృతిచెందిన దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కోరుట్ల పట్టణ సమీప ప్రాంతమైన ఏకీన్ పూర్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయి. గ్రామానికి చెందిన అందుగుల మల్లయ్య (65)కు చెందిన బర్రెపై తీగలు పడటంతో.. బర్రె  ఒక్కసారిగా అరిచి చనిపోయింది. దాంతో బయట ఏం జరిగిందో చూద్దామని తన మనవరాలు మౌనిక(17)తో కలిసి బర్రె వద్దకు వెళ్తుండగా వారు కూడా తీగను తొక్కారు. దాంతో తాతామనవరాలు ఇద్దరూ షాక్ కు గురై అక్కడికక్కడే మరణించారు. తాతా మనవరాలు ఇద్దరూ చనిపోవడంతో.. వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బుధవారం రాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఆ వర్షాలే వీరి ప్రాణాలను బలిగొన్నాయి.

For More News..

ఐటీ ఉద్యోగులకు లేఆఫ్ కష్టాలు

తెలంగాణలో 20 రోజుల్లో 30 వేల కేసులు

చికెన్లో మత్తు కలిపి.. తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్