ఆందోళనల నడుమ .. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ

ఆందోళనల నడుమ .. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ

హైదరాబాద్, వెలుగు :గ్రేటర్ సిటీలో శనివారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ఆందోళనల నడుమ కొనసాగింది. భారీ పోలీసు బందోబస్తు  పర్యవేక్షణలో ఇండ్ల పట్టాలను అందజేశారు. ఇండ్లు రాని అర్హుల ను పోలీసులు అడ్డుకోవడంతో అప్లై చేసిన రసీదులను చూపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ పరిధి కాప్రా సర్కిల్ శ్రీరాం నగర్ కి చెందిన  ఓ మహిళ .. మేయర్ విజయలక్ష్మి కాళ్లు మొక్కి ఇల్లు ఇవ్వాలని ప్రాధేయపడింది. కుత్బుల్లా పూర్  బహదూర్ పల్లిలో దరఖాస్తుల రసీదులు చూపుతూ ఆందోళన చేశారు. పంపిణీ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు.   -