ఇవాళ లేదా రేపు గ్రూప్ 2 నోటిఫికేషన్!     

ఇవాళ లేదా రేపు గ్రూప్ 2 నోటిఫికేషన్!     

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు రెడీ అవుతున్నరు. టీఎస్‌‌‌‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోని కమిషన్ కమిటీ మీటింగ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్‌‌‌‌, హాస్టల్ వార్డెన్స్ నోటిఫికేషన్లపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో ఆయా నోటిఫికేషన్లు రిలీజ్ చేసే అంశంపై క్లారిటీ రానుంది. ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

దీంతో శుక్రవారం లేదా శనివారం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశముంది. అయితే, గతంలో గ్రూప్ 2 ద్వారా 663 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించినా, ఆ తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, ఏబీసీడబ్ల్యూవో, ఏటీడబ్ల్యూవో, ఏఎస్‌‌‌‌డబ్ల్యూవో పోస్టులను యాడ్ చేశారు. దీంతో ఆ పోస్టుల సంఖ్య 783 పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే, మరో నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.